సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
Posted 2026-02-19 14:33:13
0
278
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది.
అचानक బోటు మొరాయించడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును ఘటనాస్థలానికి పంపించారు.
అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు వేగంగా కొనసాగించడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పర్యాటకులను సురక్షితంగా తీరానికి తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు సముద్రయాన సేవలు నిలిచిపోయాయి.
పర్యాటకులు మాట్లాడుతూ, టూరిజం బోట్ల ఫిట్నెస్ను నిరంతరం తనిఖీ చేయాలని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Working Capital Loans to Keep Your Business Moving
Working capital loans provide businesses with the funds needed to manage daily operational...
బోయకొండలో రహస్య కోడిపందెం; 13 మందిని అరెస్ట్.
అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై...
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే...