జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|

0
141

మేడ్చల్ మల్కాజ్గిరి :  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని, మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

మల్కాజ్‌గిరి పరిధిలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, వినాయక్‌నగర్ డివిజన్‌లోని జె.కె. కాలనీలో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ (IAS) ఆర్.వి. కర్ణన్ కు వినతి పత్రాన్ని వ్యక్తిగతంగా అందజేశారు.

అదేవిధంగా, జీహెచ్ఎంసీ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల భూములను అమ్మకానికి పెట్టిన HILTP పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు

రూ. 5 లక్షల కోట్ల విలువ కలిగిన 9,292 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మేస్తూ దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ స్కామ్‌కు తెరలేపిన రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ విధానాలను ఎమ్మెల్యే లు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులను మాఫియాలకు కొట్టేస్తున్న ఈ అన్యాయాన్ని తాము ఏ విధంగానైనా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల తో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు..

   Sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి వేసవి ప్రభావాలు అధిక ఉష్ణోగ్రతలు: వేసవిలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు చేరుకుంటాయి. గత ఏడాది సుల్తానాబాద్ వంటి ప్రాంతాల్లో 44.5°C నమోదైంది.
PEDDAPALLI 
By Sunka Santhosh 2026-03-26 05:45:21 0 247
Telangana
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
By Sadaq Sadaq 2026-03-22 15:35:54 0 144
Andhra Pradesh
సింగపూర్‌గా మారనున్న ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పోర్టులు, ఐటీ,...
By Babitha Babitha 2026-05-20 04:32:43 0 47
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 11:59:47 0 272
Andhra Pradesh
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
By Rajini Kumari 2025-12-22 08:01:06 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com