బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

0
30

బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు సీడీపీఓ జి. సులోచన రాణి పావులూరు సెక్టార్ పరిధిలోని భీమవరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేశారు.
పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి సమయానుకూలంగా నులిపురుగు మందు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధిత ఎమ్మెల్యే, హెచ్‌పి ఏఎన్ఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియు అంగన్వాడీ సిబ్బంది హాజరయ్యారు.

 

#Narendra

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com