ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్

0
66

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజల వేదనలను ఆలకించే వేదికగా మారిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రేషన్ కార్డుల్లో తప్పులు, ఇంటి పట్టాలు, పింఛన్లు వంటి అంశాలపై ప్రజల నుంచి అధికంగా అర్జీలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు కనీసం స్థలాలు ఎక్కడో కూడా చూపించలేదని బాధితులు వాపోయారు. ఇంటి పట్టా చేతికిచ్చి ఆర్భాటంగా ప్రచారం చేసుకుని.. స్థలం కూడా చూపించని అసమర్థ ప్రభుత్వాన్ని ఏమని నిందించాలి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం. ఈ క్రమంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించాం.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.
చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ...
By Gadiyapudi Narendra 2026-02-10 03:32:20 0 49
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 11:10:00 0 48
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 772
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com