పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.

0
164

బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి గారు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కీలకమైన పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ (Committee on Home Affairs) సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో పార్లమెంట్ హౌస్ అన్వెక్సీలో ఈ సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో ప్రధానంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు.

బడ్జెట్ కేటాయింపులు: హోం సెక్రటరీ గారు సమర్పించిన నివేదికపై ఎంపీ గారు చర్చిస్తూ, దేశ భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన నిధుల కేటాయింపులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

పోలీసు బలగాల ఆధునికీకరణ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) మరియు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ల (CPOs) బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఆధునిక సాంకేతికత వినియోగంపై కమిటీలో చర్చించారు.

దేశ భద్రతను పటిష్టం చేయడంలో మరియు హోం శాఖ పనితీరును మెరుగుపరచడంలో ఈ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఎంతో కీలకమని ఎంపీ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని...
By Chunarkar Jagadeesh 2026-05-08 19:06:17 0 1K
Business & Finance
Unsecured Loans for Flexible Business Funding Solutions
Unsecured loans provide quick access to funds without requiring collateral, making them an...
By Navya Sree 2026-07-23 06:16:42 0 27
Business & Finance
Bengaluru Metro Safety Review Ordered After Disruptions
Authorities have directed BMRCL to review recurring metro service disruptions in Bengaluru over...
By Navya Sree 2026-07-01 13:28:45 0 99
Andhra Pradesh
ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు
కడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని  గ్రామ...
By Boya Dasthagiri 2026-05-24 14:14:06 0 208
Andhra Pradesh
సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో  నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
చీరాల: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని  సెయింట్ మార్క్స్ సెంటెనరీ...
By Gadiyapudi Narendra 2025-12-26 14:46:37 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com