పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి గారు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కీలకమైన పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ (Committee on Home Affairs) సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో పార్లమెంట్ హౌస్ అన్వెక్సీలో ఈ సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ప్రధానంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు.
బడ్జెట్ కేటాయింపులు: హోం సెక్రటరీ గారు సమర్పించిన నివేదికపై ఎంపీ గారు చర్చిస్తూ, దేశ భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన నిధుల కేటాయింపులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పోలీసు బలగాల ఆధునికీకరణ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) మరియు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ల (CPOs) బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఆధునిక సాంకేతికత వినియోగంపై కమిటీలో చర్చించారు.
దేశ భద్రతను పటిష్టం చేయడంలో మరియు హోం శాఖ పనితీరును మెరుగుపరచడంలో ఈ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఎంతో కీలకమని ఎంపీ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz