మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు

0
368

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా  నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు అప్పజెప్పారు .అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది .తమకిచ్చిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో ఛేదించేందుకు టీడీపీ నేతలు పోటీలు పడి మొక్కలు నాటుతున్నారు .అందులో భాగంగానే 15 వ డివిజన్ లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు .డివిజన్ ఇంచార్జ్ కెపి చౌదరి,డివిజన్ నేత దశరధ రామయ్య లు మాట్లాడుతూ 
నెల్లూరును ఒక మోడల్ గ్రీన్  సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతీ ఐదు మీటర్లకు ఒక చెట్టు  నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం , పచ్చదనంతో నిండిన పర్యావరణం  ప్రజలకు  ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సిటీలో ఉండే 28 డివిజన్లో  చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు  .
అందులో భాగంగా ఈరోజు 15 డివిజన్లో మొదలుపెట్టామని  వారంలో పూర్తి చేస్తామన్నారు . 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ,యూనిట్ ఇన్ చార్జీలు ,డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

Search
Categories
Read More
Andhra Pradesh
రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము...
By Boiena Rajesh 2026-07-17 05:57:44 0 44
Jammu & Kashmir
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation Kishtwar, Jammu...
By BMA ADMIN 2025-05-23 10:23:30 0 2K
Andhra Pradesh
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...
By John Baji 2026-02-04 15:15:25 0 514
Andhra Pradesh
టీటీడీ లడ్డు కల్తీ వాస్తవం జనసేన అధ్యక్షులు వాసు
టీటీడీ లడ్డులు కల్తీ చేసింది వాస్తవం: జనసేన పార్టీ రాష్ట్ర  కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు,...
By Rajini Kumari 2026-02-07 11:45:07 0 144
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:15:14 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com