మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు

0
98

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా  నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు అప్పజెప్పారు .అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది .తమకిచ్చిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో ఛేదించేందుకు టీడీపీ నేతలు పోటీలు పడి మొక్కలు నాటుతున్నారు .అందులో భాగంగానే 15 వ డివిజన్ లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు .డివిజన్ ఇంచార్జ్ కెపి చౌదరి,డివిజన్ నేత దశరధ రామయ్య లు మాట్లాడుతూ 
నెల్లూరును ఒక మోడల్ గ్రీన్  సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతీ ఐదు మీటర్లకు ఒక చెట్టు  నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం , పచ్చదనంతో నిండిన పర్యావరణం  ప్రజలకు  ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సిటీలో ఉండే 28 డివిజన్లో  చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు  .
అందులో భాగంగా ఈరోజు 15 డివిజన్లో మొదలుపెట్టామని  వారంలో పూర్తి చేస్తామన్నారు . 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ,యూనిట్ ఇన్ చార్జీలు ,డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

Search
Categories
Read More
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 1K
Andhra Pradesh
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లోను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373...
By Gadiyapudi Narendra 2025-12-30 11:19:02 0 266
Andhra Pradesh
సృజనాత్మక సాంస్కృతిక చైర్ పర్సన్ పోడవటి తేజస్విని గారిని కలిసిన గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
ఈరోజు మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సృజనాత్మక మరియు సాంస్కృతిక చైర్పర్సన్ పొడవటి తేజస్విని...
By Benguluri Madhubabu 2026-02-11 10:06:32 0 209
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com