మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు

0
371

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా  నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు అప్పజెప్పారు .అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది .తమకిచ్చిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో ఛేదించేందుకు టీడీపీ నేతలు పోటీలు పడి మొక్కలు నాటుతున్నారు .అందులో భాగంగానే 15 వ డివిజన్ లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు .డివిజన్ ఇంచార్జ్ కెపి చౌదరి,డివిజన్ నేత దశరధ రామయ్య లు మాట్లాడుతూ 
నెల్లూరును ఒక మోడల్ గ్రీన్  సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతీ ఐదు మీటర్లకు ఒక చెట్టు  నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం , పచ్చదనంతో నిండిన పర్యావరణం  ప్రజలకు  ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సిటీలో ఉండే 28 డివిజన్లో  చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు  .
అందులో భాగంగా ఈరోజు 15 డివిజన్లో మొదలుపెట్టామని  వారంలో పూర్తి చేస్తామన్నారు . 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ,యూనిట్ ఇన్ చార్జీలు ,డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

Search
Categories
Read More
Andhra Pradesh
ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
  ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! 06-06-2026 Sat 06:20...
By Pagadala Venkateswar 2026-06-06 06:05:24 0 126
Andhra Pradesh
ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి
*ప్రచురణార్థం* *18-01-2026*   *ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి*  ...
By Rajini Kumari 2026-01-18 13:25:00 0 169
Andhra Pradesh
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-05 13:42:52 0 197
Andhra Pradesh
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
By Kothuru Murali 2026-05-07 12:09:25 0 92
Andhra Pradesh
వి శాఖ లో లోకా యుక్త
విశాఖ పట్నం  జిల్లా పరిషత్  కార్య లయం లో .లోకా యుక్త కార్య క్రమం  న కు విశేష...
By Mobbu Venkatramana 2026-01-29 15:44:54 0 533
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com