Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
180

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న సీఎం చంద్రబాబు

 

ట్రస్ట్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు

తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంస

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. 

 

ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, వారి బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
SURAKSHA
Mona K. Khandhar, IAS: Leading Gujarat with Innovation
The new Journey Begins Strong governance is built on innovation, transparency,...
By Fathima Safa 2026-07-20 07:26:51 0 43
Dadra &Nager Haveli, Daman &Diu
Electoral Roll Overhaul: ECI Launches Phase III
The Election Commission of India (ECI) today officially kickstarted Phase III of the Special...
By Dunna Jessicaruth 2026-05-14 11:27:48 0 223
Telangana
నిజామాబాద్: కల్యాణలక్ష్మి - షాధీముబారక్ చెక్కల పంపిని
ఈ రోజు నందిపేట్ మండల రెవెన్యు కార్యాలయంలో కళ్యాణలక్ష్మిషాదీముబారక్ పాతకాల లబ్ధికారులకు చెకుల...
By Sadaq Sadaq 2026-04-20 16:28:01 0 136
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 2K
Telangana
రామగుండం : ఏడేళ్ల చిన్నారిపై హత్యాచార యత్నం..!
అంతర్గం మండలం పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 వయసు గల ఓ సమీప...
By Sunka Santhosh 2026-04-13 12:28:37 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com