Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
43

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న సీఎం చంద్రబాబు

 

ట్రస్ట్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు

తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంస

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. 

 

ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, వారి బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కలిసి కాచిగూడ -భగవతి రైల్ వే స్టేషన్ కు మొదటి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ జిల్లా/కాచిగూడ.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-07-19 17:13:19 0 904
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 135
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com