మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు

0
63

*ప్ర‌చురణార్థం* *14-02-2026*

 

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు

మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక

 

విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్ తో కలిసి హాజరయ్యారు. 

 

శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు స‌మావేశం లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబసభ్యులతో పాల్గొని, మంత్రి లోకేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ కి మంగ‌ళ‌గిరి చేనేత చీర బ‌హుక‌రించారు. అలాగే యువ‌నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడి భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అడిగి తెలుసుకుని త‌న స‌హ‌కారం ఎప్పుడు వుంటుంద‌ని తెలిపారు.

 

రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుల బాగోగులు, పిల్లల విద్య, క్రీడలపై చర్చలు సాగిన ఈ కార్యక్రమంలో, అందరూ ఒకేచోట భోజనం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడప‌టం, . త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. మంత్రి లోకేష్ ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబాల‌తో ఆత్మీయ విందు స‌మావేశ కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఏపీ రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టార‌ని కొనియాడుతూ...మంత్రి నారా లోకేష్ లో ఒక రాజ‌నీతిజ్ఞుడు క‌నిపిస్తున్నాడ‌ని ప్ర‌శంసించారు.

Search
Categories
Read More
Telangana
వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్...
By Sidhu Maroju 2026-01-06 09:48:58 0 75
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు...
By Kothuru Murali 2026-02-08 10:27:12 0 24
Telangana
తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2025-07-08 06:13:13 0 1K
Andhra Pradesh
మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ
కర్నూలు :  దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య  విగ్రహాన్ని...
By Hari Krishna 2025-12-12 14:00:55 0 204
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com