మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు

0
62

*ప్ర‌చురణార్థం* *14-02-2026*

 

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు

మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక

 

విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్ తో కలిసి హాజరయ్యారు. 

 

శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు స‌మావేశం లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబసభ్యులతో పాల్గొని, మంత్రి లోకేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ కి మంగ‌ళ‌గిరి చేనేత చీర బ‌హుక‌రించారు. అలాగే యువ‌నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడి భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అడిగి తెలుసుకుని త‌న స‌హ‌కారం ఎప్పుడు వుంటుంద‌ని తెలిపారు.

 

రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుల బాగోగులు, పిల్లల విద్య, క్రీడలపై చర్చలు సాగిన ఈ కార్యక్రమంలో, అందరూ ఒకేచోట భోజనం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడప‌టం, . త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. మంత్రి లోకేష్ ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబాల‌తో ఆత్మీయ విందు స‌మావేశ కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఏపీ రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టార‌ని కొనియాడుతూ...మంత్రి నారా లోకేష్ లో ఒక రాజ‌నీతిజ్ఞుడు క‌నిపిస్తున్నాడ‌ని ప్ర‌శంసించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది......
చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య...
By Gadiyapudi Narendra 2026-02-12 12:49:39 0 41
Telangana
మరోసారి భగ్గుమన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ మరో సారి భగ్గుమంది.. 2024 జూలై , ఆగస్టు లో జరిగినఅలర్లలో షేక్ హసీనా ప్రభుత్వని...
By Yadamma Raju Gajapaga 2025-12-23 20:54:29 0 287
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 109
Andhra Pradesh
నవులూరు గ్రామంలో స్మశాన వాటికలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు
*నవులూరు గ్రామంలోని స్మశాన వాటికలలో అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన నాయకులు*   *స్మశాన...
By Rajini Kumari 2026-01-10 13:22:59 0 66
Andhra Pradesh
డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు : నంద్యాల జిల్లా : డోన్ : ద్రోణాచలం :  డోన్ పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలను...
By Hari Krishna 2025-12-23 14:11:52 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com