పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం

0
428

కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు...
By Sidhu Maroju 2026-06-22 08:53:06 0 124
Telangana
మూసీ ప్రక్షాళనలో కీలక అడుగు: 10 వేల ఇళ్లు, 3,200 ఎకరాల సేకరణకు గెజిట్ విడుదల!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'మూసీ రివర్‌ఫ్రంట్...
By Sidhu Maroju 2026-03-13 10:49:34 0 172
SURAKSHA
WB Police Use Tech to Find Missing Individuals
The West Bengal Police has achieved a high success rate in locating missing persons by...
By Kalaga Sailaja 2026-06-27 08:39:14 0 73
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
అన్నమయ్య జిల్లా, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన...
By Kothuru Murali 2026-05-07 12:11:42 0 115
Telangana
అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్...
By Sidhu Maroju 2026-03-16 12:02:03 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com