అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |

0
147

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదని “ఎ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ – అల్వాల్ సర్కిల్” అధ్యక్షుడు నిమ్మా అశోక్ రెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ)కు ఫిర్యాదు చేశారు.

ఇటీవల అల్వాల్ మండల పరిధిలో నిర్వహించిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినవిగా ఉండటంతో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించడం అవసరమని లేఖలో తెలిపారు.

కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీల నాయకులను మాత్రమే ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించడం సరైన విధానం కాదని, ఇది ప్రజాస్వామ్య పరంగా కూడా తగదని అశోక్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇకపై అల్వాల్ మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించి, స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఆయన ఎంఆర్ఓను కోరారు.

ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్బీఐ లో ఉద్యోగాలు!!
కర్నూలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రేడ్-బి పోస్టుల...
By Hari Krishna 2025-12-23 04:25:49 0 165
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
గుంటూరు: నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి...
By SivaNagendra Annapareddy 2025-12-13 08:04:34 0 283
Telangana
మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా...
By Nookapangu Manikanta 2026-05-05 10:20:13 0 73
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనం ఢీకొని విద్యార్థినికి త్రీవ గాయాలు
శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి...
By Kothuru Murali 2026-01-31 16:06:07 0 130
Andhra Pradesh
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
By Pagadala Venkateswar 2026-01-26 11:56:11 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com