యువత సన్మార్గంలో పయనించాలి

0
426

జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ శిబిరం తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పూజ శ్రీ బసవలింగ అవధూత మహారాజ్ మాట్లాడుతూ:--- ప్రస్తుతం ఏ రంగం చూసిన యువతదే ప్రధాన పాత్రఉంటుందని, అలాంటి యువత దేవుడు సూచించిన సన్మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. విద్యా,వైద్య,రాజకీయం... ఇలా అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధిని సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని వారిని నిత్యం పూజించాలని, గౌరవించాలని. జూదం,ల్లో మట్కా, గంజాయి, మద్యంల్లోఇలాంటితు చెడు వ్యాసనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేయకుండా ఉండాలని సూచించారు. ముగిసిన తరగతులు.... యోగ సాధానతో అన్ని రోగాలను అధిగమించవచ్చని పూజ శ్రీ బసవలింగ అవధూత పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తగిలి వచ్చారు. శిక్షణ తరగతులు సాగిన ఐదు రోజులపాటు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

                                     రిపోర్టర్: శివాజీ

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 220
Karnataka
Karnataka Boosts Investment Through Global Initiatives
Karnataka continues to strengthen its position as one of India's leading investment destinations...
By Fathima Safa 2026-06-27 12:52:52 0 59
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 206
Andhra Pradesh
అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌,...
By Rajini Kumari 2026-01-09 10:17:04 0 169
Telangana
మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం...
By Ponnala Srinivasrao 2026-03-04 03:55:38 0 470
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com