ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

0
177

పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –

          ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనా నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

      ఈ రోజు ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కల్యాణము మరియు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అర్చన పూజలు నిర్వహించారు, స్వామి వారి కార్యక్రమమును మహామఁడపము 7 వ అఁతస్తు నఁదు ఏర్పాటు చేసిన పూజను తిలకిఁచిన భక్తులు స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

         ఆలయ కార్య నిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజలు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని అన్నారు. వివాహం మరియు సంతానం: వివాహం లేదా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రేయస్సు: మంచి ఆరోగ్యం, విజయం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని భక్తులు స్వామి వారి ఆశీస్సులు పొందడానికి నెలకు ఒకసారి జరిగే సేవలొ అనగాఈ పూజలో ఉభయ రుసుము రూ.1,116/- ల టిక్కెట్టు పై శ్రీ స్వామి వారి సేవలొ పాల్గొనడం ఎంతో మంచిదని సూచించారు.

ఈ పూజా కార్యక్రమం ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆలయ అర్చకులు మరియు సిబ్బంది సహకారంతో విశేషముగా పూజ కార్యక్రమము జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు...
By Mobbu Venkatramana 2026-01-26 14:50:53 0 521
Andhra Pradesh
మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.
మదనపల్లె మాజీ కౌన్సిలర్ సిద్ధమ్మ, సత్యనారాయణ, రేవతి శుక్రవారం తమకు ఎదురవుతున్న ముప్పు గురించి...
By Pagadala Venkateswar 2026-03-13 14:08:57 0 126
Andhra Pradesh
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం...
By Kothuru Murali 2026-02-12 14:05:56 0 117
Andhra Pradesh
చేప పిల్లలు విడుదల చేసిన టిడిపి మండలాధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు
Tసుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు...
By Benguluri Madhubabu 2026-03-10 14:15:39 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com