కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన

0
177

కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సముద్ర పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మికుల పోరుకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. సముద్ర పోర్టులో కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ఈ కోడ్‌లు ఉన్నాయని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళారి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వేతన సమరక్షణ, పని గంటల పెంపు, ఈపీఎఫ్, బోనస్ వంటి అంశాల్లో కార్మికులకు తుంగలో తొక్కేలా లేబర్ కోడ్ ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!
అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం   తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-03 07:08:41 0 113
Andhra Pradesh
ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ...
By Pagadala Venkateswar 2026-03-05 06:45:17 0 113
Andhra Pradesh
రోడ్డు భద్రతలపై ప్రజలకు అవగాహన : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లారహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ...కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ...
By Hari Krishna 2026-01-17 17:11:36 0 135
Andhra Pradesh
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
By Mobbu Venkatramana 2026-02-27 15:32:02 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com