కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన

0
150

కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సముద్ర పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మికుల పోరుకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. సముద్ర పోర్టులో కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ఈ కోడ్‌లు ఉన్నాయని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళారి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వేతన సమరక్షణ, పని గంటల పెంపు, ఈపీఎఫ్, బోనస్ వంటి అంశాల్లో కార్మికులకు తుంగలో తొక్కేలా లేబర్ కోడ్ ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బర్ధన్ ఆశయాలను కొనసాగిద్దాం... జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పిలుపు...
జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఐ నగర...
By John Baji 2026-01-03 02:13:37 0 142
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 175
Telangana
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.
హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని...
By Sidhu Maroju 2025-08-16 09:09:02 0 602
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com