కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన

0
190

చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై హైస్కూల్‌కు వెళ్తున్న గవినివారి పాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అంగిరేకుల శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మృతి చెందారు.
వివరాల ప్రకారం, అంగిరేకుల శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ హైస్కూల్‌కు చేరుకుంటున్న సమయంలో, రహదారి మధ్యలో అడ్డంగా ఉన్న కేబుల్ ఆయన మెడకు తగలడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం స్కూల్‌కు ముందుగా చేరే ప్రధాన ఉపాధ్యాయుడు వస్తారని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ దుర్వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
పాఠశాలకు కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో, గవినివారి పాలెం హైస్కూల్ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేబుల్‌ను రహదారిపై నిర్లక్ష్యంగా వదిలివేయడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-01-26 06:01:25 0 180
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Benguluri Madhubabu 2026-06-01 02:38:25 0 152
Delhi - NCR
Delhi-NCR Advances Smart City Digital Governance
Delhi-NCR is accelerating its Smart City and digital governance initiatives to enhance urban...
By Fathima Safa 2026-06-25 11:50:01 0 98
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 202
Andhra Pradesh
బ్రతికే ఉన్న మహిళను మృతురాలిగా నమోదు చేసిన అధికారులు..!
మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్‌కు చెందిన చెవిటి, మూగ మహిళ షర్మిలను రేషన్ కార్డులో మృతురాలిగా...
By Pagadala Venkateswar 2026-06-23 06:06:36 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com