దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|

0
171

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి. 

మల్కాజిగిరి చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేశాక, అనంతరం వినాయక నగర్ చౌరస్తా, నేరేడ్మెట్ చౌరస్తా, అల్వాల్ మీ సేవ చౌరస్తాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అక్కడి నుంచి కార్ల ర్యాలీగా గండి మైసమ్మ – మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ—

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం చేసిన నిరంతర దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించేందుకు ఈ రోజు “దీక్ష దివస్”ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏం బీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్,కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రావుల అంజయ్య,  జేఏసి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లి పరమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి...
By Kothuru Murali 2026-02-10 07:21:51 0 117
Andhra Pradesh
భవాని భక్తుల సౌకర్యాన్ని మరిన్ని పెంచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ 13-12-2025      *భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని...
By Rajini Kumari 2025-12-13 11:22:11 0 316
Andhra Pradesh
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ...
By Rajini Kumari 2025-12-16 12:14:25 0 183
Andhra Pradesh
Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-06 03:54:07 0 102
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com