దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|

0
199

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి. 

మల్కాజిగిరి చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేశాక, అనంతరం వినాయక నగర్ చౌరస్తా, నేరేడ్మెట్ చౌరస్తా, అల్వాల్ మీ సేవ చౌరస్తాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అక్కడి నుంచి కార్ల ర్యాలీగా గండి మైసమ్మ – మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ—

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం చేసిన నిరంతర దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించేందుకు ఈ రోజు “దీక్ష దివస్”ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏం బీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్,కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రావుల అంజయ్య,  జేఏసి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లి పరమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి" విజయోత్సవ సభ
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి"...
By Chennaiah Kati 2026-06-18 05:27:51 0 81
Rajasthan
Rajasthan Boosts Industrial Investment and MSME Growth
Rajasthan is strengthening its industrial economy by attracting fresh investments and promoting...
By Fathima Safa 2026-06-30 12:15:08 0 58
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|
  మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17...
By Sidhu Maroju 2026-01-01 12:43:55 0 184
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 204
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-19 05:02:45 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com