దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|

0
99

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి. 

మల్కాజిగిరి చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేశాక, అనంతరం వినాయక నగర్ చౌరస్తా, నేరేడ్మెట్ చౌరస్తా, అల్వాల్ మీ సేవ చౌరస్తాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అక్కడి నుంచి కార్ల ర్యాలీగా గండి మైసమ్మ – మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ—

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం చేసిన నిరంతర దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించేందుకు ఈ రోజు “దీక్ష దివస్”ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏం బీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్,కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రావుల అంజయ్య,  జేఏసి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లి పరమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం
చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణబాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న...
By Gadiyapudi Narendra 2026-01-27 15:59:48 0 97
Andhra Pradesh
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:07:31 0 126
Andhra Pradesh
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:52:50 0 221
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ...
By Benguluri Madhubabu 2026-01-31 04:48:40 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com