Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.

0
147

అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్

33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి

ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న విద్యాసాగర్ 

 

ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో నిన్న నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విద్యాసాగర్‌ను దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

 

ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణతో పాటు నేతలు ఎం. రఘునాథరెడ్డి, జి. హృదయరాజు, బి. సాంబశివరావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 214
Kerala
IMD Issues Urgent Red Alert for Five Rain-Battered Kerala Districts
The India Meteorological Department (IMD) has issued an urgent Red Alert for five districts in...
By Tejaswini Komanduru 2026-06-05 09:58:45 0 788
Andhra Pradesh
గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!
కర్నూలు : త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్...
By Hari Krishna 2025-12-21 09:47:03 0 203
Andhra Pradesh
🐄 పశు ఔషధి విక్రయ కేంద్రాలు – జిల్లా చర్యలు
గుంటూరు జనవరి 21:పశువులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర మార్గదర్శకాల...
By John Baji 2026-01-21 13:39:34 0 227
Andhra Pradesh
అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి..
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల...
By Gadiyapudi Narendra 2026-02-03 16:04:03 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com