Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.

0
111

అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్

33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి

ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న విద్యాసాగర్ 

 

ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో నిన్న నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విద్యాసాగర్‌ను దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

 

ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణతో పాటు నేతలు ఎం. రఘునాథరెడ్డి, జి. హృదయరాజు, బి. సాంబశివరావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ 24-12-2025   ప్రచురణార్థం   *సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:01:13 0 241
Telangana
ఫిరంగి... ఆకట్టుకునేట్టు!
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది....
By Thativar Shivaji 2026-01-28 05:03:05 0 405
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:21:29 0 125
Telangana
దస్తూరాబాద్: సమస్యలపై ప్రత్యేక దృష్టి
గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాట్లు గొడిసెర్యాల గోండు గూడెం (జీ)...
By Mitappaly Shiavji 2026-01-13 04:20:54 0 360
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com