Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.

0
149

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు కోర్టు

సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఊరట

రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

 

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

 

గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సీఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

 

ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు
14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:34:28 0 354
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 595
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 168
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Andhra Pradesh
ACB Raids: ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.
Andhra ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh...
By Pagadala Venkateswar 2026-01-30 06:03:16 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com