మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’

0
187

ఏడాదంతా టైం పాస్ చేసి.. పరీక్షల టైంలో కొందరు విద్యార్ధులు నానాతంటాలు పడుతుంటారు. పాస్ చేయమని ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి బతిమిలాడుకునే వారిని చూశాం.. పాస్ చేయకపోతే చంపేస్తానని బెదిరించే వాళ్లను కూడా చూశాం. ఈ ఏడాది అంతకు మించి అన్నట్లు మరో ఆణిముత్యం బయటకు వచ్చింది..

‎పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారని.. తల్లిదండ్రులు గంపెడు ఆశలతో పెద్ద కాలేజీల్లో చేర్పించి, లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తుంటారు. అయితే వారి పిల్లలు మాత్రం ఫోన్లలో రీల్స్‌ చేయడానికి, సోషల్‌ మీడియాలో గంటల కొద్ది గడపడానికి ఆసక్తి చూపుతూ చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. తీరా పరీక్షల సమయంలో అడ్డదారులు తొక్కుతుంటారు. సాధారణంగా ఇలా టైం పాస్‌ చేసే విద్యార్ధులు ఆన్సర్ షీట్లలో తమను పాస్‌ చేయాలని టీచర్లను రకరకాలు వేడుకుంటూ ఉంటారు. కొందరు ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి పాస్‌ చేయమని బతామాలుకుంటే.. మరికొందరు సినిమా స్టోరీలు, పాటలు రాసి పేజీలు నింపేస్తుంటారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు పూర్తవడంతో సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఈ క్రమంలో పేపర్లు దిద్దుతున్న మాస్టర్లకు ఇలాంటి మరో ఆణిముత్యం తగిలింది. ఓ విద్యార్ధి ఆన్సర్ షీట్లో రాసిన సమాధానం, గీసిన బొమ్మలు చూసి ఎగ్జామినర్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో వెంటనే సదరు ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం రాశాడంటే.ఈ ఆన్సర్ షీట్‌లో సదరు విద్యార్థి.. ‘సార్.. నాకు అమ్మా నాన్న లేరు సార్. మీరే నాకు అమ్మా నాన్న. నన్ను పాస్ చేయండి సార్. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’ అని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా గురువు కాళ్లపై శిష్యుడు బోర్లా పడి నమస్కరిస్తున్నట్టుగా బొమ్మ కూడా గీశాడు. గురువు బొమ్మ దగ్గర ‘సార్’ అని, శిష్యుడి బొమ్మ దగ్గర ‘నేను’ అని రాసి సదరు విద్యార్థి తన టాలెంట్‌ చూపించాడు. ఈ మేరకు ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ నెట్టింట వైరల్ కావడతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఎంతకు తెగించార్రా’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. మరోకరు ‘ఇప్పుడు ఫెయిల్ ఐతే ఏంటంట? నీకు అర్థం అవుతుందా..’ అని కామెంట్ పెట్టారు. ఇంకా.. ‘వీడు పాసైన ఫెయిలైన జబర్దస్త్‌ లాంటి షోకి వెళ్తే ఫేమస్‌ అవుతాడు’, ‘ఇచ్చేయండి సార్.. పాస్ మార్కులు ఇచ్చేయండి’ అంటూ మీమ్స్‌తో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకు తల్లిదండ్రులు లేరని, చదువుకున్నది గుర్తుకు రావట్లేదని, దయచేసి పాస్ చేయాలని విద్యార్థి వేడుకుంటున్న ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదుగానీ.. విద్యార్థి వేడుకుంటున్న విధానం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.
  జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ 16-06-2026 Tue  Andhra...
By Pagadala Venkateswar 2026-06-16 13:10:57 0 73
Andhra Pradesh
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో...
By Pagadala Venkateswar 2026-02-17 05:10:45 0 167
Andhra Pradesh
FFC ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించిన సీఎం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి సోమవారం మొలకలదిన్నెలో ఎఫ్‌ఎఫ్‌సీ ఫ్యాక్టరీ...
By Pagadala Venkateswar 2026-05-26 05:47:08 0 90
Andhra Pradesh
కల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పులిచెర్ల మండలం ,...
By Kothuru Murali 2026-05-27 14:43:14 0 83
Bharat Aawaz
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో...
By Sriramula Anil 2026-05-18 07:01:29 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com