Nara Lokesh: విద్యార్థులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్.

0
86

ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 1,200 కోట్లను విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రకటించారు. తాజాగా బ్యాంకు విడుదల ఉత్తర్వుల (BROs) ద్వారా ఈ నిధులను తక్షణమే విడుదల చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు వెంటనే లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మా హామీ ఒక్కటే. ఇకపై చదువులకు ఎవరికీ ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించి, భవిష్యత్తులో సకాలంలో సాయం అందించడమే మా ప్రభుత్వ స్పష్టమైన నిబద్ధత," అని వివరించారు.

 

ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. "మీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంది, మీరంతా ధైర్యంగా చదువుకోండి" అని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ నిధుల విడుదలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Search
Categories
Read More
Telangana
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి...
By Pinnehasan Odela 2026-01-15 14:31:53 0 369
Andhra Pradesh
మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం...
By Pagadala Venkateswar 2026-03-01 09:54:40 0 89
Telangana
జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|
హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్...
By Sidhu Maroju 2026-04-01 17:54:09 0 87
Karnataka
Finance Minister Nirmala Sitharaman Chairs ‘Chintan Shivir’ to Chart Roadmap for #ViksitBharat 2047
  VIJAYANAGARA, KARNATAKA — Union Minister for Finance and Corporate Affairs, Smt....
By Venugopal Gopal 2025-12-23 16:39:08 0 416
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com