Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

0
148

ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైనం 

కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంత వరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణనలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళ వేషంలో మాయల మరాఠీ గ్యాంగ్.. గుట్టు రట్టు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం...
By Pagadala Venkateswar 2026-06-03 05:32:42 0 78
Sikkim
Sikkim Celebrates Historic 50th Statehood Day
Sikkim is celebrating its historic 50th Statehood Day today, marking five decades since its...
By Dunna Jessicaruth 2026-05-16 04:46:11 0 86
Andhra Pradesh
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం
: *తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ* .. *  విజయనగర చక్రవర్తి...
By Rajini Kumari 2026-01-16 12:42:14 0 211
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-10 04:31:11 0 136
Telangana
రాజకీయ వ్యాఖ్యల హద్దులు ఎక్కడ? వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ చర్చలో బాల్క సుమన్ అరెస్ట్.!
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ఆరోపణలు,...
By Ponnala Srinivasrao 2026-05-30 08:06:54 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com