Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.

0
159

శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.

 

గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ, చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకే అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి, కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు, కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు.

 

వైసీపీ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిబంధనను ఒక ఆయుధంగా మార్చి రైతులను, సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తమ అవినీతి, భూకబ్జాలపై సభలో సమాధానం చెప్పలేకనే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తమ బాధ్యతను గుర్తించి, బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.
ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య...
By Pagadala Venkateswar 2026-06-16 13:22:38 0 70
Bharat
👉 వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి...
By SivaNagendra Annapareddy 2025-12-23 07:56:19 0 285
Andhra Pradesh
ఇస్రో లో అప్రెంటిస్ ఉద్యోగాలు :
కర్నూలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్,...
By Hari Krishna 2025-12-23 04:39:47 0 189
Andhra Pradesh
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...
By Kothuru Murali 2026-01-31 11:05:46 0 169
Andhra Pradesh
క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్
25.12.2025.   క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ...
By Rajini Kumari 2025-12-25 10:41:49 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com