Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.

0
84

శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.

 

గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ, చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకే అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి, కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు, కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు.

 

వైసీపీ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిబంధనను ఒక ఆయుధంగా మార్చి రైతులను, సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తమ అవినీతి, భూకబ్జాలపై సభలో సమాధానం చెప్పలేకనే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తమ బాధ్యతను గుర్తించి, బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
By Gadiyapudi Narendra 2025-12-27 16:07:15 0 332
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 08:32:58 0 84
Telangana
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
By Sidhu Maroju 2025-09-16 15:16:07 0 214
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా డిసెంబర్ 15 2025 ఇంధన పొదుపు తో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 15, 2025*...
By Rajini Kumari 2025-12-15 11:41:43 0 143
Haryana
Haryana to Launch Village-Level Renewable Energy Plan |
Haryana plans to implement decentralized renewable energy solutions across villages, inspired by...
By Pooja Patil 2025-09-16 05:37:59 0 159
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com