అల్వాల్ ముంపు కష్టాలకు చెక్ : రూ. 2.3 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులకు శ్రీకారం. |

0
186

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను తీర్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ లోని చినరాయుడు చెరువు సమీపంలో రూ. 2.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రెయిన్ పనులకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వర్షపు నీటి నిల్వ సమస్యకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును మంజూరు చేయించామని కాలనీల నివాసితులు ముంపు భయం లేకుండా ఉండవచ్చని తెలిపారు.

 

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా అల్వాల్ సర్కిల్ వ్యాప్తంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని అధికారుల పర్యవేక్షణలో నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. 

 

ఈ కార్యక్రమంలో... సర్కిల్ డి.ఈ ప్రశాంతి, ఏ.ఈ అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రతినిధులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత...
By Pagadala Venkateswar 2026-07-15 05:29:47 0 44
Business & Finance
Still Filing Taxes Manually Choose E-Filings Today
E-filing simplifies the process of submitting tax returns, statutory forms, and government...
By Navya Sree 2026-07-10 07:06:05 0 74
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
By Pagadala Venkateswar 2026-01-28 10:32:39 0 143
Andhra Pradesh
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
By John Baji 2026-01-06 13:03:16 0 203
Telangana
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
  ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
By G k Nookala 2026-03-05 09:58:33 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com