Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.

0
176

ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ ప్రతినిధులు

భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం

మహానంది బ్రహ్మోత్సవాలకు కూడా ముఖ్యమంత్రికి అందిన ఆహ్వానం 

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

 

ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.

 

దీనిపై స్పందించిన సీఎం, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో, నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Ratan Lal Dangi, IPS: A Symbol of Courage and Leadership
A distinguished 2005-batch IPS officer of the Madhya Pradesh cadre, admired for his firm...
By Kalaga Sailaja 2026-07-23 14:45:45 0 28
Telangana
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
By Chunarkar Jagadeesh 2026-07-01 16:56:40 0 184
SURAKSHA
Anurag Jain: Visionary Bureaucrat Driving India's Future
From Madhya Pradesh Chief Secretary to CEO of NITI Aayog, Anurag Jain’s remarkable journey...
By Lokeshwari Panthadi 2026-07-23 04:42:29 0 38
Andhra Pradesh
మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది
ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2026-03-03 12:15:33 0 167
Telangana
పట్టాలెక్కిన ప్రగతి: ప్రయాణికులకు ఇక సాఫీ ప్రయాణం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)    మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల...
By Sidhu Maroju 2026-01-28 05:58:00 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com