YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల.

0
170

ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న

 

సంగమేశ్వరం బదులు ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కట్టడంపై అభ్యంతరం

 

స్వప్రయోజనాల కోసం సీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ

ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరూ నాటకాలు ఆడారాని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుబట్టారు.

 

వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు" అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. "ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా?" అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, సీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆమె విమర్శించారు.

 

 

 

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. "ఎవరిని మోసం చేయడానికి ఇద్దరూ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు? మోదీ దగ్గర సాగిలపడి సీమకు అన్యాయం చేస్తారా?" అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 197
Andhra Pradesh
వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీ హోదా లక్ష్యం
వాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల కోరిక ఆశయం లక్ష్యం...
By Boya Dasthagiri 2026-07-06 14:32:07 0 114
Telangana
రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!    భారత్ ఆవాజ్  న్యూస్: TG: రాష్ట్రంలో...
By Gujile Ramu 2026-05-03 09:59:21 0 143
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.
శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ...
By Pagadala Venkateswar 2026-06-22 07:00:02 0 59
Telangana
"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు...
By Sidhu Maroju 2026-04-29 09:28:21 0 292
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com