"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!

0
14

"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_

: జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ 

 

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ :

_ఈ నెల 28న జరుపుకోనున్న పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ డివిజన్ జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేశారు._

  ఖుర్బానీ కోసం దయచేసి ఆవులను కొనవద్దు. మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను కొని ఖుర్బానీ ఇవ్వండి. మన హిందూ సోదరులు ఆవులను తల్లిగా, గోమాతగా పూజిస్తారు. వారి మనోభావాలను మనం గౌరవించి మత సామరస్యానికి పాటుపడదాo అని ఆయన కోరారు.

త్యాగానికి అసలైన అర్థం:

బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక. ఆ త్యాగం జంతువును వధించడంలోనే కాదు, మన సాటి సోదరుల మనోభావాలను గౌరవించడంలోనూ ఉంది. మనం హిందూ సోదరులను గౌరవించడమే అసలైన త్యాగం అని అన్నారు_

 ఒక మతం వారు పవిత్రంగా భావించే దాన్ని మరో మతం వారు గౌరవిస్తేనే దేశంలో ఐకమత్యం ఉంటుంది. ఇస్లాం కూడా ఇతర మతాలను, వారి ఆచారాలను గౌరవించమనే బోధిస్తుంది. దేశంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది...
By Kothuru Murali 2026-03-17 07:06:10 0 121
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
By Sidhu Maroju 2025-06-22 15:33:37 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com