Ayyanna Patrudu: సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

0
159

రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

సభలో లేవనెత్తే ప్రతి అంశానికి మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించడం తన బాధ్యతని వెల్లడి

 

మీడియా సమాజహితం కోసం పనిచేయాలని సూచన

 

శాసనసభకు గైర్హాజరువుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చలు జరగకుండా.. రోడ్లపై మాత్రమే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలని సూచించారు. సభలో లేవనెత్తే ప్రతి అంశానికి మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించడం తన బాధ్యతని స్పష్టం చేశారు. 

 

రోడ్లపై జరుగుతున్న ఈ గుద్దులాట సంస్కృతి ఏంటో అర్థం కావడం లేదని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీనే సరైన వేదిక అని అన్నారు. ఇదే సమయంలో నో వర్క్.. నో పే విధానంపై అయ్యన్న మరోసారి స్పందించారు. ఈ విధానాన్ని ఎమ్మెల్యేలకూ అమలు చేయాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 

 

 

 

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తనలాంటి మనస్తత్వం ఉన్నవారికి రాజకీయాలు సూట్ కావడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నానని, ఇంకా కొనసాగిస్తే గౌరవం కూడా మిగిలే పరిస్థితి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా విశాఖలో భూముల ధరలు పెరగడం, గతంలో రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఫిర్యాదులు లేకపోవడం వంటి అంశాలపై కూడా ఆయన స్పందించారు. పాత్రికేయుల బాధ్యతలపై ప్రస్తావిస్తూ.. మీడియా సమాజహితం కోసం పనిచేయాలని సూచించారు. వక్రీకరణల ద్వారా అసలు విషయం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు"
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు" AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట...
By Chennaiah Kati 2026-02-25 13:24:44 0 218
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
By Pagadala Venkateswar 2026-04-20 09:07:41 0 164
Andhra Pradesh
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.
iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3...
By Vadlamudi NagaVenkat 2026-04-18 13:06:53 0 219
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 97
Andhra Pradesh
పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ...
By Rajini Kumari 2026-03-14 11:26:44 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com