సముద్రంలో విద్యార్థుల గల్లంతు* పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు...

0
186

చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు గురవుతున్నారు.

 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,
పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు గ్రామానికి చెందిన చందులూరి శ్రీరామ్ (15) పుట్టినరోజు సందర్భంగా దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్ నలుగురు విద్యార్థులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక బైక్ మీద చిన్నగంజాం మండలం బాపయనగర్ బీచ్ దగ్గర సముద్రంలో మునగడానికి వెళ్లారు. అవినాష్, శ్రీరామ్ ఇద్దరు సముద్రంలో నీట మునిగి ఆచూకీ తెలియలేదు. హేమంత్, హేమ వర్ధన్ సముద్రం ఒడ్డునే ఉండటంతో క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో జిల్లాలోని తీర ప్రాంతం ఉలిక్కిపడింది. విద్యార్థులు గల్లంతు కావడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Meghalaya
Meghalaya Schools Announce Mid-Term Break Schedule
As of July 1, 2026, schools across Meghalaya that completed their mid-term examinations by June...
By Lokeshwari Panthadi 2026-07-02 06:02:54 0 66
Telangana
కన్న తల్లిదండ్రులనే క్షోభ పెట్టే కవితక్క ఎట్లా పరాయి వాళ్లకు 'అమ్మ 'అయితది ?
కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు… ‎కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ...
By Ponnala Srinivasrao 2026-04-26 02:36:38 0 119
Andhra Pradesh
ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి...
By Mobbu Venkatramana 2026-01-29 17:11:07 0 564
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 210
Telangana
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
By Sadaq Sadaq 2026-05-01 14:55:50 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com