సముద్రంలో విద్యార్థుల గల్లంతు* పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు...

0
187

చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు గురవుతున్నారు.

 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,
పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు గ్రామానికి చెందిన చందులూరి శ్రీరామ్ (15) పుట్టినరోజు సందర్భంగా దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్ నలుగురు విద్యార్థులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక బైక్ మీద చిన్నగంజాం మండలం బాపయనగర్ బీచ్ దగ్గర సముద్రంలో మునగడానికి వెళ్లారు. అవినాష్, శ్రీరామ్ ఇద్దరు సముద్రంలో నీట మునిగి ఆచూకీ తెలియలేదు. హేమంత్, హేమ వర్ధన్ సముద్రం ఒడ్డునే ఉండటంతో క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో జిల్లాలోని తీర ప్రాంతం ఉలిక్కిపడింది. విద్యార్థులు గల్లంతు కావడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
ఆటో ఢీకొని ఫీల్డ్ అసిస్టెంట్ కి తీవ్ర గాయాలు.
చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్...
By Pagadala Venkateswar 2026-06-04 05:44:06 0 88
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 437
Andhra Pradesh
ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు
ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు...
By Chennaiah Kati 2026-06-22 06:14:53 0 57
Andhra Pradesh
కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-05-04 13:44:38 0 120
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com