జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.

0
199
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
ఘన వ్యర్థాలు నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తతో పర్యావరణానికి హాని, అనర్థాలను కలిగించే అంశాలను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. మురుగునీటి నిర్వహణ విషయంలో అధికారులు అలసత్వం ఉండరాదన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త, ఘన వ్యర్ధాల సేకరణ జరగాలన్నారు. చెత్త, ఘన వ్యర్ధాల విభజన నిబంధనలనుసరించి చేపట్టాలన్నారు. ఘన వ్యర్ధాలు పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రాసెసింగ్ యూనిట్లకు పంపే అంశాలపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. మురుగునీటిని పద్ధతి ప్రకారం పట్టణం నుంచి దిగువ ప్రాంతాలకు మళ్లించడం, బయటకు పంపడం, శుద్ధి చేసే యూనిట్ లను విస్తరింప చేయాలన్నారు.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, కమిటీ సభ్యులైన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి సీనియర్ కార్యకర్త నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి...
By Benguluri Madhubabu 2026-02-07 04:02:39 0 260
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను...
By Kothuru Murali 2026-05-17 16:52:39 0 84
Andhra Pradesh
శ్రీ అమ్మవారి శ్రీ చక్రం పూజకు గోశాల పాలు
శ్రీ అమ్మవారి శ్రీ చక్ర నవారాణార్చన పూజకు పోరంకి గోశాల పాలు: పత్రికా ప్రకటన     ...
By Rajini Kumari 2026-01-16 12:44:37 0 191
Andhra Pradesh
మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ.
  మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ 06-06-2026 Sat 08:27 Andhra Mega...
By Pagadala Venkateswar 2026-06-06 05:56:37 0 95
Telangana
Elections in telangana
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 18:02:17 0 412
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com