తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా

0
129

*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*

 

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా పట్టపగలే నల్ల మట్టి లారీలు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మానందపురంలో చోటుచేసుకున్న ప్రమాదం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

 

ఉండవల్లి ప్రాంతం నుండి మట్టి తరలింపునకు అనుమతులు లేనప్పటికీ, రవాణాదారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎర్రబాలెం మీదుగా బ్రహ్మానందపురం చేరుకుని, అక్కడి నుండి హైవే ద్వారా విజయవాడ, ఇప్పటం, మెల్లెంపూడి వంటి ప్రాంతాలకు భారీగా మట్టిని తరలిస్తున్నారు. కేవలం రాజధాని గ్రామాలకు మాత్రమే మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నట్లు తెలుస్తున్నా, ఆ ముసుగులో ఇతర ప్రాంతాలకు వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 

ఉదయం బ్రహ్మానందపురంలో అతివేగంగా వెళ్తున్న ఒక మట్టి లారీ ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆగ్రహించిన స్థానికులు మట్టి లారీలను అడ్డుకున్నారు.

 

నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

సంబంధిత అధికారులు దీని పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 605
Telangana
250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra
-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా -2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ...
By Nagula Swamy 2026-03-16 10:24:14 0 319
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్...
By Sadaq Sadaq 2026-05-14 16:32:17 0 56
Andhra Pradesh
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో...
By Eslavath RameshNaik 2026-01-16 17:19:49 0 198
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవోలు దగ్ధం
*ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవోలు దహనం*   *భోగిమంటల్లో జీవో 590,...
By Rajini Kumari 2026-01-14 12:26:58 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com