తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా

0
98

*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*

 

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా పట్టపగలే నల్ల మట్టి లారీలు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మానందపురంలో చోటుచేసుకున్న ప్రమాదం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

 

ఉండవల్లి ప్రాంతం నుండి మట్టి తరలింపునకు అనుమతులు లేనప్పటికీ, రవాణాదారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎర్రబాలెం మీదుగా బ్రహ్మానందపురం చేరుకుని, అక్కడి నుండి హైవే ద్వారా విజయవాడ, ఇప్పటం, మెల్లెంపూడి వంటి ప్రాంతాలకు భారీగా మట్టిని తరలిస్తున్నారు. కేవలం రాజధాని గ్రామాలకు మాత్రమే మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నట్లు తెలుస్తున్నా, ఆ ముసుగులో ఇతర ప్రాంతాలకు వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 

ఉదయం బ్రహ్మానందపురంలో అతివేగంగా వెళ్తున్న ఒక మట్టి లారీ ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆగ్రహించిన స్థానికులు మట్టి లారీలను అడ్డుకున్నారు.

 

నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

సంబంధిత అధికారులు దీని పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన డోన్ ఎమ్మెల్యే!!
కర్నూలు: డోన్ : బేతంచర్ల :  బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో ఉన్న...
By Hari Krishna 2025-12-22 14:53:21 0 170
Andhra Pradesh
భీమవరంలో బంగారు నగల కోడిపుంజు
*భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు*   భీమవరం దుర్గాపురం లో జరిగిన కోడిపందాల లో ఓ...
By Rajini Kumari 2026-01-18 14:22:29 0 132
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త!* 🎉 న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-24 14:15:42 0 190
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-21 08:22:03 0 139
Andhra Pradesh
పొలం పిలుస్తుంది - వరి నారుమళ్లపై అవగాహన...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల వ్యవసాయ శాఖ ఆధరవ్యంలో నిర్వహిస్తున్న దాళ్వా...
By BABJI DADALA 2025-12-24 15:45:15 0 309
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com