ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.

0
131

 

ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra

Chandrababu Naidu Orders 24 Hour Vehicle Registration in Andhra Pradesh

వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేసేలా కీలక నిర్ణయం

ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం

అత్యవసర సేవలు మినహా అన్నీ ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టీకరణ

రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ పూర్తిచేసేలా, వాహన డీలర్లనే అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని, ప్రజలకు ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ నిర్ణయంతో వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పనుంది.

 

సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందాలని, అందుకు అనుగుణంగా అధికారులు వినూత్న ఆలోచనలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం సూచించారు. ఏఐని సమర్థంగా వాడుకునేందుకు నిపుణులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, రాష్ట్రంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఒక వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ముఖ్యంగా మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు మధ్యప్రదేశ్ డ్రోన్ వ్యవస్థను ఎలా వినియోగిస్తుందో అధ్యయనం చేసి, ఏపీలోనూ ఆ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

 

రాష్ట్రంలో తీవ్రమవుతున్న ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'అవేర్' సాంకేతికతను వాడుకోవాలన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వడదెబ్బ తగలకుండా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. 

 

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా, ప్రతి జిల్లా కలెక్టర్‌కు తక్షణ అవసరాల నిమిత్తం రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, బోర్ల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.

 

ప్రభుత్వ పథకాల అమలు తీరును, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. కార్యదర్శుల స్థాయి అధికారులు నెలలో 3 రోజులు, శాఖాధిపతులు (హెచ్‌ఓడీలు) 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలన్నారు. 

 

ప్రజాభిప్రాయ సేకరణకు కాల్ సెంటర్ ద్వారా వివరాలు సేకరించాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టం చేశారు. చేపల వేట నిషేధం ముగిశాక, 'అవేర్' డేటా ఆధారంగా చేపలు సమృద్ధిగా లభించే ప్రాంతాల వివరాలను మత్స్యకారులకు తెలియజేయాలని ఆదేశించారు.

 

ఈ సమీక్షా సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...
By Chennaiah Kati 2026-01-06 15:10:41 0 371
Andhra Pradesh
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*    *నూతన యాగశాల ద్వారా...
By Rajini Kumari 2025-12-19 09:54:12 0 207
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 182
Bihar
Bihar Approves EV Policy 2026 to Boost Green Mobility
Patna: To drastically cut down carbon emissions and save an estimated 10 crore liters of fuel...
By Dunna Jessicaruth 2026-05-16 05:42:44 0 158
Andhra Pradesh
మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం...
By Pagadala Venkateswar 2026-03-01 09:54:40 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com