మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

0
197

కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పదోన్నతి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిద్దలూరు మరియు బెస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల అత్యంత సానుకూలంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలు కోరిన 15 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 13 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు పదవీ విరమణ చేసిన అనంతరం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచడం, మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని 15,000 రూపాయలు, పదవీ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.. తమ చిరకాల వాంఛ అయిన పదోన్నతిని కల్పించినందుకు, అలాగే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్...
By Shyamala Yadagiri 2026-06-05 17:20:02 0 204
Telangana
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు...
By Pinnehasan Odela 2026-02-02 07:24:26 0 270
Andhra Pradesh
నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20,...
By Rajini Kumari 2026-02-20 23:22:13 0 171
Telangana
"శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను...
By Sidhu Maroju 2026-06-17 11:13:43 0 117
Andhra Pradesh
పెళ్లి కార్డులో సీఎం ఫోటోలు ముద్రించి ఆహ్వానం పలికిన TDP నేత.
మదనపల్లె మండలం పనసమాకులపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జి. వి. నాయుడు, తన కుమార్తె వివాహ...
By Pagadala Venkateswar 2026-04-02 05:40:37 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com