అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన శ్రీ నెట్టెం రఘురాం

0
171

ప్రెస్ నోట్

04.02.2026

 

అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం

 

అమరావతి: కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు

 

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో PACS సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఒకసారి ప్రత్యేక ప్రమోషన్లను పరిశీలించవలసిందిగా ఆయన అభ్యర్థించారు. 

 

పలు గ్రామీణ PACS సంఘాలు డైలీవేజ్ సిబ్బందిపై ఆధారపడి పనిచేస్తున్నాయని, అందువల్ల అర్హత పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.

 

కేడీసీసీ బ్యాంక్ మరియు PACS ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచితే అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు మరింత కాలం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 

కొన్ని వేతనాలు “Suspense Due To Account” కింద నిల్వ ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా, అవసరమైన విద్యార్హతలు పొందేందుకు గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగిస్తే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని, వారి ఉద్యోగ భద్రత కాపాడబడుతుందని అభ్యర్థించారు.

 

ఈ వినతులన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ సహకార వ్యవస్థ బలోపేతానికి, రైతులకు నిరంతర సేవలందించేందుకు దోహదపడతాయని శ్రీ నెట్టెం రఘురాం గారు తెలిపారు. 

 

ముఖ్యమంత్రి గారు నెట్టెం రఘురాం గారి వినతిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈరోజు శ్రీమతి సావిత్రి పూలే బాయ్ జయంతి
ఈరోజు శ్రీమతి సావిత్రి బాయ్ గారి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజారపు శివ...
By Rajini Kumari 2026-01-03 09:25:20 0 218
Andhra Pradesh
Pileru: పీలేరు-పులిచర్ల మార్గంలో రెడ్డివారిపల్లి వద్ద పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. రూ. 26 లక్షల ఎర్రచందనం స్వాధీనం, ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.
Pileru: పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి వద్ద 26 లక్షలు విలువ చేసే ఎర్రచందనం అక్రమ...
By Pagadala Venkateswar 2026-07-16 14:09:10 0 36
Andhra Pradesh
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
By Pagadala Venkateswar 2026-01-23 07:00:17 0 159
Andhra Pradesh
కర్నూలు కి తొందరలో తుంగభద్ర నీటి సరఫరా నిలిపివేత?
 కర్నూలు !! వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న...
By Hari Krishna 2025-12-12 11:28:46 0 485
Telangana
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ...
By Prashanth Goindla 2026-02-10 14:57:38 0 461
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com