అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన శ్రీ నెట్టెం రఘురాం

0
135

ప్రెస్ నోట్

04.02.2026

 

అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం

 

అమరావతి: కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు

 

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో PACS సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఒకసారి ప్రత్యేక ప్రమోషన్లను పరిశీలించవలసిందిగా ఆయన అభ్యర్థించారు. 

 

పలు గ్రామీణ PACS సంఘాలు డైలీవేజ్ సిబ్బందిపై ఆధారపడి పనిచేస్తున్నాయని, అందువల్ల అర్హత పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.

 

కేడీసీసీ బ్యాంక్ మరియు PACS ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచితే అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు మరింత కాలం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 

కొన్ని వేతనాలు “Suspense Due To Account” కింద నిల్వ ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా, అవసరమైన విద్యార్హతలు పొందేందుకు గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగిస్తే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని, వారి ఉద్యోగ భద్రత కాపాడబడుతుందని అభ్యర్థించారు.

 

ఈ వినతులన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ సహకార వ్యవస్థ బలోపేతానికి, రైతులకు నిరంతర సేవలందించేందుకు దోహదపడతాయని శ్రీ నెట్టెం రఘురాం గారు తెలిపారు. 

 

ముఖ్యమంత్రి గారు నెట్టెం రఘురాం గారి వినతిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 133
Telangana
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు భారత్ అవాజ్ కొడంగల్ నియోజకవర్గం  రిపోర్టర్...
By Vanmoj Suryamohan 2026-03-30 03:30:51 0 203
Telangana
నిజామాబాద్
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా...
By Sadaq Sadaq 2026-05-19 15:46:20 0 38
Telangana
చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి...
By Gaddam Vikram 2026-03-18 13:33:17 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com