*నంద్యాల కేసు కెనాలకు ఘనంగా జలహారతి* *అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*

0
95

*నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి*

*ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్*

నంద్యాల ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అయిన కేసీ కెనాల్ (కర్నూలు-కడప) కాలువకు బుధవారం ఘనంగా 'జలహారతి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ గారికి పోన్నాపురం కాలనీ వద్ద పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. 19వ వార్డు టీడీపీ ఇంచార్జి షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిరోజ్ గారు కాలువకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండీ ఫిరోజ్ గారు మాట్లాడుతూ నంద్యాల రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించే కేసీ కెనాల్‌కు తగినంత నీరు విడుదల కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, సాగునీటి లభ్యత పెరగడం వల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, బ్యాంకు తిమ్మయ్య, డైరెక్టర్లు మునియార్ ఖలీల్ , ఉప్పరి సురేష్ కుమార్ , కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, బోయ రామకృష్ణ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , చలం బాబు , మిట్నాల రవి , వడ్డే జనార్ధన్, ఖాజా శంకర్, సుబ్బయ్య, జనార్ధన్ ,సాయి రామ్, బద్రి శెట్టి రవి, మాజీ ఎంపీటీసీ జనార్దన్ గౌడ్ ,కెసిపి పుల్లయ్య, విద్యా కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా, కోడూరు శీను, అడ్వకేట్ హరి, వార్డు సెక్రటరీ కాజా శంకర్, టిడిపి సీనియర్ నాయకులు పుట్ట నాగరాజు, గొల్ల రమణ, వెంకటరమణ, నాగేశం, రైటర్ ప్రసాద్ ,యువ నాయకులు సుబ్బు, శ్రీలం శేఖర్ ,

బూత్ ఇంచార్జ్ దివాకర్, షేక్ మూర్తిజ, జనసేన యువ నాయకుడు ఆకాశ రెడ్డి, ధనుంజయ శర్మ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనారు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు
పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి...
By Kothuru Murali 2025-12-24 04:51:07 0 106
Andhra Pradesh
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను భర్తరాఫ్ చేయాలి, (సిపిఎం
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమకు సేకరించిన భూముల వలన నష్టపోయిన...
By mahaboob basha 2025-09-04 14:20:14 0 305
Andhra Pradesh
Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence కేజీహెచ్ వైద్యుల...
By Pagadala Venkateswar 2026-01-31 10:26:59 0 44
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com