ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|

0
135

హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో తిష్ట వేసిన ఒక అవినీతి తిమింగలం నేడు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. 

ఒక కాంట్రాక్టర్ నుండి ఏకంగా 15 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ కూకట్ పల్లి జోనల్ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి పట్టుబడ్డాడు.

 

వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి జోన్ పరిధిలో పనులు పూర్తిచేసిన ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఎస్.ఈ చిన్నారెడ్డి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు 

 

లంచం ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ఖరాఖండిగా చెప్పడంతో, భాదితుడు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు. 

అధికారుల వ్యూహం ప్రకారం, నేడు కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ని చుట్టుముట్టింది. 

 

రసాయనాలు పూసిన నోట్లను చిన్నారెడ్డి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

 

చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం, ఆయన కార్యాలయం తో పాటు, ఆయన నివాసంలోను ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోధాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడా! అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

 

 

కూకట్ పల్లి జిహెచ్ఎంసి విభాగంలో ఇంతటి భారీ అవినీతి బయటపడడం నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో చిన్నారెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం...
By Bharat Aawaz 2025-08-12 05:56:55 0 714
Telangana
బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|
హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో...
By Sidhu Maroju 2025-11-01 18:49:58 0 232
Andhra Pradesh
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:22:16 0 410
Telangana
పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..CM రేవంత్ రెడ్డి
ఆంధ్ర, తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్ర లేని వాళ్ళు అలా మాట్లాడతారు, లగడపాటి...
By Ponnala Srinivasrao 2026-04-19 01:30:39 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com