ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|

0
112

హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో తిష్ట వేసిన ఒక అవినీతి తిమింగలం నేడు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. 

ఒక కాంట్రాక్టర్ నుండి ఏకంగా 15 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ కూకట్ పల్లి జోనల్ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి పట్టుబడ్డాడు.

 

వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి జోన్ పరిధిలో పనులు పూర్తిచేసిన ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఎస్.ఈ చిన్నారెడ్డి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు 

 

లంచం ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ఖరాఖండిగా చెప్పడంతో, భాదితుడు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు. 

అధికారుల వ్యూహం ప్రకారం, నేడు కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ని చుట్టుముట్టింది. 

 

రసాయనాలు పూసిన నోట్లను చిన్నారెడ్డి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

 

చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం, ఆయన కార్యాలయం తో పాటు, ఆయన నివాసంలోను ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోధాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడా! అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

 

 

కూకట్ పల్లి జిహెచ్ఎంసి విభాగంలో ఇంతటి భారీ అవినీతి బయటపడడం నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో చిన్నారెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ...
By Chennaiah Kati 2026-01-14 06:14:18 0 206
Telangana
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్: _🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_ "దుర్గాష్టమి"...
By Sidhu Maroju 2025-09-30 10:55:36 0 235
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా : MLC.శంబిపూర్ రాజు.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ...
By Sidhu Maroju 2025-12-28 10:01:22 0 152
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com