Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.

0
161

ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్

కిడ్నాపర్లను గంటన్నరలో పట్టుకున్న పోలీసులు

 

బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ... కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వ్యక్తులు వీరిని ఓ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

కిడ్నాప్ విషయం తెలుసుకున్న సీపీఎం నేత కందారపు మురళి జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు... కిడ్నాపర్లను వెంబడించారు. గంటన్నరలోనే వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వాహనాలను సీజ్ చేశారు. 

 

నిందితులను పీఎస్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు... యూనివర్శిటీ పీఆర్వో సతీశ్ ను ఏ1గా, మోహన్ బాబును ఏ2గా, మంచు విష్ణును ఏ3గా చేర్చా

Search
Categories
Read More
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 270
Telangana
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-04-28 04:38:41 0 133
Telangana
తెలంగాణా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ
కవిత కొత్త పార్టీ పేరు ఇదే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు మేడ్చల్ సభలో తన...
By MERIGE MALLESH 2026-04-25 07:27:56 0 582
Andhra Pradesh
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...
By Boiena Rajesh 2026-04-12 00:17:57 0 162
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com