ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

0
88

ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

 బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల పరిధిలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలో, పొలాల్లోని ట్రాన్స్-ఫార్మర్లు మరియు కాలేజీ బిల్డింగ్ లోని రాగివైర్లు దొంగిలించిన ఐదుగురు ముద్దాయిలను బల్లికురవ SI నాగరాజు బల్లికురవ పాత బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 4 లక్షల 40 వేల విలువైన రాగితీగను స్వాధీనపరచుకున్నారు.

 అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు: 

1.కొమరగిరి ప్రసాద్ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, పిన్నివారిపాలెం గ్రామం, బాపట్ల మండల & జిల్లా, 

2.కాశిమళ్ళ శ్యాంబాబు తండ్రి ఏడుకొండలు, వయస్సు 22 సం’’లు,మిన్నికల్లు గ్రామం, సంతమాగులూరు మండలం, 

3.ఈగ లక్ష్మినారాయణ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, రామకృష్ణాపురం, బాపట్ల టౌన్,

 4.కల్లూరి ఏసోబు తండ్రి ప్రసాద్, వయస్సు 20 సం’’లు, కొత్త నందాయిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా, 

5.రావినూతల రాజశేఖర్ @ విశాల్ తండ్రి డేవిడ్, వయస్సు 20 సం’’లు, నల్లమోతువారిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా .                  

 చేదించిన కేసులు మరియు రికవరీ వివరాలు: 

బల్లికురవ మండల పరిధిలో నమోదైన 3 కేసుల్లో రాగితీగ ( 50 Kg);

 నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 30 Kg);

 అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 20 Kg);

 బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ;

–మొత్తం 6 కేసుల్లో 100 Kg ల రాగితీగ (సుమారు 4 లక్షల 40 వేల రూపాయల విలువ) రికవరీ చేయబడ్డాయి.

 ముద్దాయిల నేపథ్యం మరియు చోరీ విధానం: 

ఈ ఐదుగురు ముద్దాయిలు బాపట్ల జిల్లా కు చెందినవారు అయి ఉండి వృత్తిరీత్యా కూలిపనులు చేయడం వలన జీవనోపాధి. అయితే, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు, తమ పని నుండి సరిపడా ఆదాయం రాకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. గత రెండు నెలలుగా రాత్రి సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, రాగి వైర్లు దొంగిలించి, వాటిని అమ్ముకుని తమ చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు ఈ దొంగతనాలను అలవాటు చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.

ఈ కేసు చేధనను స్వయంగా పర్యవేక్షించిన దర్శి DSP.బి.లక్ష్మినారాయణ, సంతమాగులూరు సిఐ కె,వెంకటరావు, బల్లికురవ SI వై.నాగరాజు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రెడిట్ చోరీయా.. జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: చంద్రబాబు.
AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన...
By Pagadala Venkateswar 2026-01-24 14:58:00 0 67
Andhra Pradesh
కర్నూలు జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ
జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడ కారణీలకు శిక్షణ...
By mahaboob basha 2025-12-11 00:30:10 0 302
Goa
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
By Bharat Aawaz 2025-07-17 06:22:44 0 940
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com