ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

0
206

ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

 బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల పరిధిలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలో, పొలాల్లోని ట్రాన్స్-ఫార్మర్లు మరియు కాలేజీ బిల్డింగ్ లోని రాగివైర్లు దొంగిలించిన ఐదుగురు ముద్దాయిలను బల్లికురవ SI నాగరాజు బల్లికురవ పాత బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 4 లక్షల 40 వేల విలువైన రాగితీగను స్వాధీనపరచుకున్నారు.

 అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు: 

1.కొమరగిరి ప్రసాద్ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, పిన్నివారిపాలెం గ్రామం, బాపట్ల మండల & జిల్లా, 

2.కాశిమళ్ళ శ్యాంబాబు తండ్రి ఏడుకొండలు, వయస్సు 22 సం’’లు,మిన్నికల్లు గ్రామం, సంతమాగులూరు మండలం, 

3.ఈగ లక్ష్మినారాయణ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, రామకృష్ణాపురం, బాపట్ల టౌన్,

 4.కల్లూరి ఏసోబు తండ్రి ప్రసాద్, వయస్సు 20 సం’’లు, కొత్త నందాయిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా, 

5.రావినూతల రాజశేఖర్ @ విశాల్ తండ్రి డేవిడ్, వయస్సు 20 సం’’లు, నల్లమోతువారిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా .                  

 చేదించిన కేసులు మరియు రికవరీ వివరాలు: 

బల్లికురవ మండల పరిధిలో నమోదైన 3 కేసుల్లో రాగితీగ ( 50 Kg);

 నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 30 Kg);

 అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 20 Kg);

 బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ;

–మొత్తం 6 కేసుల్లో 100 Kg ల రాగితీగ (సుమారు 4 లక్షల 40 వేల రూపాయల విలువ) రికవరీ చేయబడ్డాయి.

 ముద్దాయిల నేపథ్యం మరియు చోరీ విధానం: 

ఈ ఐదుగురు ముద్దాయిలు బాపట్ల జిల్లా కు చెందినవారు అయి ఉండి వృత్తిరీత్యా కూలిపనులు చేయడం వలన జీవనోపాధి. అయితే, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు, తమ పని నుండి సరిపడా ఆదాయం రాకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. గత రెండు నెలలుగా రాత్రి సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, రాగి వైర్లు దొంగిలించి, వాటిని అమ్ముకుని తమ చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు ఈ దొంగతనాలను అలవాటు చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.

ఈ కేసు చేధనను స్వయంగా పర్యవేక్షించిన దర్శి DSP.బి.లక్ష్మినారాయణ, సంతమాగులూరు సిఐ కె,వెంకటరావు, బల్లికురవ SI వై.నాగరాజు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు అభినందించారు.

Search
Categories
Read More
Telangana
నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...
భారత్ ఆవాజ్ న్యూస్:  నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి....
By Gujile Ramu 2026-04-28 16:01:57 0 287
Andhra Pradesh
రొంపిచర్ల :లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేసిన.. చల్లా బాబు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ...
By Kothuru Murali 2026-02-05 12:07:56 0 157
Andhra Pradesh
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు...
By Kothuru Murali 2026-03-28 06:07:27 0 173
Uttarkhand
Rural Revolution: Voluntary Land Consolidation Policy
The Uttarakhand Cabinet has officially launched the Voluntary Chakbandi (Land Consolidation)...
By Dunna Jessicaruth 2026-05-14 09:11:02 0 89
Business & Finance
Haryana Plans World-Class Wholesale Trade Hub
The Haryana Government has invited wholesale traders from Delhi to invest in a proposed...
By Navya Sree 2026-06-30 05:53:10 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com