మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.|

0
103

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిజాంపేట్ >  భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు విశేషంగా కృషి చేసి, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) పరిధిలోని బాచుపల్లి సాయి నగర్ లో మహాత్మా ఫూలే విగ్రహానికి నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్.ఎం.సి. బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు సాంబశివరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వారు మాట్లాడుతూ, మహాత్మా ఫూలే ఆశయాలను, ఆయన చూపిన బాటను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, అప్పుడే ఆయనకు సరైన నివాళులు అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలగం చంద్రయ్య,రామ్ నరసయ్య, ఆంజనేయులు,కురుమూర్తి, నర్సింగ్, నాయకురాలు భారతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
By Pagadala Venkateswar 2026-02-04 07:39:22 0 39
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్ 30 ప్రకారo 03.02.2026
గుంటూరు జిల్లాలో శాంతిభద్రతలను, శాంతిని మరియు ప్రశాంతతను కాపాడటానికి మరియు ప్రజల రాకపోకలను...
By John Baji 2026-02-04 05:05:21 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com