ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు

0
364

మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది.

​గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు. పరిపాలనలో ఆయన చూపిస్తున్న దక్షత, అందరినీ కలుపుకుపోయే తత్వం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​అనంతరం ప్రిన్సిపాల్ వెంకన్న మాట్లాడుతూ.. తన ఐదేళ్ల ప్రస్థానంలో సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి కృషితోనే కళాశాలను మరింత ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Business & Finance
Gold Prices Stay Elevated in Bengaluru Markets
Gold prices continued to remain elevated across Bengaluru, with jewellers, bullion traders, and...
By Navya Sree 2026-07-03 07:11:40 0 29
Meghalaya
Meghalaya Expands Digital Governance and Public Services
Meghalaya is advancing its digital governance initiatives by introducing new technology-driven...
By Navya Sree 2026-06-26 08:24:23 0 54
Andhra Pradesh
ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ
*ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు*   ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు...
By Rajini Kumari 2025-12-30 10:28:08 0 213
Andhra Pradesh
పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు...
By Shyamala Yadagiri 2026-05-08 15:04:36 0 176
Andhra Pradesh
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-23 04:46:03 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com