ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు

0
273

మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది.

​గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు. పరిపాలనలో ఆయన చూపిస్తున్న దక్షత, అందరినీ కలుపుకుపోయే తత్వం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​అనంతరం ప్రిన్సిపాల్ వెంకన్న మాట్లాడుతూ.. తన ఐదేళ్ల ప్రస్థానంలో సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి కృషితోనే కళాశాలను మరింత ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ 28-01-2026 Wed 07:04 | Both...
By Pagadala Venkateswar 2026-01-28 06:44:38 0 93
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 848
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bittu Bittu 2025-12-24 10:27:56 0 352
Andhra Pradesh
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్ర‌చుర‌ణార్థం* *18-02-2026*   *న‌గ‌రాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి...
By Rajini Kumari 2026-02-19 07:10:45 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com