Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.

0
147

Andhra

Case Filed Against Vidadala Rajani

గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత

రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి

 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు

ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.

 

కేసు వివరాల్లోకి వెళితే... గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ... ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళతామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై కూడా పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై... నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేశ్ పై కేసులు నమోదయ్యాయి. అంబటికి మేజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుంలో చత్రపతి శివాజీ జయంతి
పుంగనూరు నియోజకవర్గం, సదుంలో చత్రపతి శివాజీ జయంతిని పలువురు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-02-20 07:21:55 0 162
Andhra Pradesh
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
  అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
By Pagadala Venkateswar 2026-06-16 13:07:56 0 83
Andhra Pradesh
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు...
By Boya Dasthagiri 2026-05-23 07:53:43 0 207
Andhra Pradesh
డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్
విజయవాడ    *డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్*  ...
By Rajini Kumari 2026-04-24 13:13:08 0 173
Telangana
‎మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? ఎమ్మెల్యే తలసాని
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? ...
By Ponnala Srinivasrao 2026-05-18 01:29:59 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com