Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.

0
108

Andhra

Case Filed Against Vidadala Rajani

గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత

రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి

 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు

ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.

 

కేసు వివరాల్లోకి వెళితే... గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ... ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళతామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై కూడా పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై... నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేశ్ పై కేసులు నమోదయ్యాయి. అంబటికి మేజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
“ఏపీ యువతకు హైదరాబాద్ & బెంగళూరు ఎందుకు ఫస్ట్ ఛాయిస్?”
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్...
By Babitha Babitha 2026-05-16 07:09:11 0 129
Andhra Pradesh
ACBవలకు చిక్కిన రవాణా శాఖ తిమింగళం ఆస్తి విలువ 250 కోట్లు
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు   ఏసీబీ వలకు చిక్కిన...
By Rajini Kumari 2025-12-24 10:35:09 0 177
Andhra Pradesh
మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా...
By Ratna Sekhar 2026-03-11 07:09:39 0 285
Telangana
గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్
మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్...
By Avunoori Mahesh 2026-05-21 11:36:16 0 45
BMA
Artificial Intelligence and the Future of Investigative Journalism
The global journalism landscape is shifting rapidly as newsrooms integrate advanced AI tools for...
By Dunna Jessicaruth 2026-05-20 05:49:19 0 28
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com