Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.

0
149

Andhra

Case Filed Against Vidadala Rajani

గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత

రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి

 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు

ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.

 

కేసు వివరాల్లోకి వెళితే... గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ... ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళతామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై కూడా పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై... నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేశ్ పై కేసులు నమోదయ్యాయి. అంబటికి మేజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు. 

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు....
By Sunka Santhosh 2026-07-01 19:07:31 0 128
Telangana
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-05 07:47:40 0 152
SURAKSHA
సీసీ కెమెరాల ఏర్పాటులో చొరవ
'నిఘా నేత్రం'లో భాగంగా నిన్న పలు కాలనీల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ పోలీసులు సమావేశాలు...
By Kalaga Sailaja 2026-06-27 06:14:54 0 42
Andhra Pradesh
పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు...
By Kothuru Murali 2026-04-21 14:53:24 0 105
Andhra Pradesh
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
By Pagadala Venkateswar 2026-01-29 06:12:44 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com