హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡

0
116

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ పంచశీల కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న హర్యానా కమిటీ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి  చంద్రశేఖర్ తివారి,  జైపూర్ ఎంపీ అశోక్ పర్నామి, హర్యానా రాజ్యసభ సభ్యురాలు రేఖ  స్వప్న (రేఖ శర్మ ) ఈ పర్యటనలో భాగస్వామ్యమయ్యారు.  ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు సైతం ఈ పర్యటనకు రావడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది 

స్థానికంగా ఎదుర్కొంటున్న మౌలిక  సమస్యలను  నేతల దృష్టికి తీసుకువచ్చారు.

స్థానిక సమస్యలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి శ్రేణులను సమాయత్వం చేస్తూ పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు.  మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఎంపి ఈటల రాజేందర్, ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా పంచశీల కాలనీ వాసుల మద్దతు కోరుతూ,, అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని నేతలు స్పష్టం చేశారు. 

వీరితో పాటు ఈ పర్యటనలో  బిజెపి మేడ్చల్  అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి, పార్టీ నాయకులు పిట్ల నగేష్, శ్రీనివాస్ వర్మ,  సూర్య  పంచశీల కమిటీ ప్రెసిడెంట్ రాజేందర్, మరియూ కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :   తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
By Rajini Kumari 2025-12-20 12:33:27 0 129
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో పర్యటించిన మంత్రి మండిపల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర...
By Kothuru Murali 2026-03-09 08:01:33 0 86
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 165
Andhra Pradesh
5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......
వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల...
By Gadiyapudi Narendra 2026-02-10 03:35:48 0 202
Andhra Pradesh
చెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు
పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ...
By Kothuru Murali 2026-01-07 13:06:20 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com