చెప్పారంటే చేస్తారంతే - మాట నిలబెట్టుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి .|

0
119

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. కాలనీలో ఉన్న మురికి నీటి సమస్య పరిష్కారానికి స్థానిక కార్పొరేటర్ నడుం బిగించారు.

రూ. 26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణ పనులను ఆమె ఈరోజు ఘనంగా ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల కష్టాలను తీర్చడానికి, నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

 

పనులు జాప్యం జరిగితే సహించేది లేదని, నాణ్యతతో కూడిన పనులను యుద్ధ ప్రాతిపదకన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 

 

ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రమేష్, సతీష్, అనిల్, సాజిద్, యాదగిరి గౌడ్, పోచయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

తమ కాలనీ సమస్యలపై తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయించినందుకు, స్థానిక ప్రజలు, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...
By Boiena Rajesh 2026-03-01 09:10:24 0 121
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత...
By Pagadala Venkateswar 2026-03-17 11:42:36 0 90
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత...
By Pagadala Venkateswar 2026-01-19 16:57:50 0 115
Telangana
బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల
సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న...
By Sidhu Maroju 2025-10-18 13:11:12 0 239
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com