చెప్పారంటే చేస్తారంతే - మాట నిలబెట్టుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. కాలనీలో ఉన్న మురికి నీటి సమస్య పరిష్కారానికి స్థానిక కార్పొరేటర్ నడుం బిగించారు.
రూ. 26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణ పనులను ఆమె ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల కష్టాలను తీర్చడానికి, నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పనులు జాప్యం జరిగితే సహించేది లేదని, నాణ్యతతో కూడిన పనులను యుద్ధ ప్రాతిపదకన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రమేష్, సతీష్, అనిల్, సాజిద్, యాదగిరి గౌడ్, పోచయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
తమ కాలనీ సమస్యలపై తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయించినందుకు, స్థానిక ప్రజలు, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz