Chandrababu Naidu: రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని చూస్తోంది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.

0
146

అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన

 

మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయన ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని, సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందన్న చంద్రబాబు.. ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నేతలదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ మనకూ తేడా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు
*విజయవాడ నగరపాలక సంస్థ* *14-12-2025*     *అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు*  ...
By Rajini Kumari 2025-12-15 11:12:11 0 350
Telangana
SRP3&3A గని SOM కి మెమోరాండం అందించిన TBGKS నాయకులు
శ్రీరాంపూర్ జూన్ 03 : బుధవారం రోజున SRP3&3A ఇంక్లైన్స్లో ఉదయం 7 గంటలకి తెలంగాణ బొగ్గు గాని...
By Avunoori Mahesh 2026-06-03 15:47:04 0 138
Andhra Pradesh
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
By Boiena Rajesh 2026-04-04 08:26:01 0 183
Telangana
మాకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి
విద్య కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ.... అనే వాక్యాన్ని తీవ్రంగా...
By Bheeshman King 2026-02-27 11:29:03 0 506
Telangana
కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు...!
కరీంనగర్ లోని వావిలాలపల్లిలో  సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద...
By Sunka Santhosh 2026-06-20 13:38:27 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com