Chandrababu Naidu: రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని చూస్తోంది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.

0
24

అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన

 

మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయన ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని, సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందన్న చంద్రబాబు.. ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నేతలదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ మనకూ తేడా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
𝗦𝗮𝗶𝗳𝗮𝗯𝗮𝗱 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 & 𝗖𝗖𝗦 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗧𝘄𝗼 𝗦𝗲𝗿𝘃𝗮𝗻𝘁 𝗧𝗵𝗲𝗳𝘁 𝗢𝗳𝗳𝗲𝗻𝗱𝗲𝗿𝘀 – 𝗝𝗲𝘄𝗲𝗹𝗹𝗲𝗿𝘆 𝗪𝗼𝗿𝘁𝗵 ₹𝟭.𝟱 𝗖𝗿 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
Hyderabad:  Saifabad Police, in coordination with CCS Hyderabad, arrested two offenders...
By Sidhu Maroju 2025-09-11 14:57:27 0 201
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:27:47 0 1K
Andhra Pradesh
తండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.
ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం...
By Pagadala Venkateswar 2026-02-03 06:33:20 0 25
Andhra Pradesh
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:49:37 0 218
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com