Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!

0
130

నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ 

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం

ఫిబ్రవరి 14న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల

అదే రోజున వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్న మంత్రి అచ్చెన్నాయుడు

దాదాపు నాలుగు వారాల పాటు కొనసాగనున్న సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో ఈ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

 

గవర్నర్ ప్రసంగం అనంతరం, సభలో ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 12న ఈ తీర్మానంపై చర్చ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చర్చకు సమాధానం ఇస్తారు.

 

ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. దాదాపు నాలుగు వారాల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం పొందడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు తాడిపత్రి కి సీఎం రాక
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం...
By Gitta Raju 2026-04-06 05:09:02 0 218
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 785
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 373
Andhra Pradesh
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు
ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా...
By Karapati Gopi 2025-12-28 14:56:18 0 272
Telangana
నిజామాబాద్: రేపు పలు ఎరియలాలో విద్యుత్ అంతరాయం
33 కెవి లింక్ లైన్ కరణంగ రేపు(బుధవారం) ఉదయం 8 గం నుండి 11గంటల వారకు ఈ ప్రాంతలో విద్యుత్...
By Sadaq Sadaq 2026-03-31 18:02:31 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com