Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!

0
153

నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ 

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం

ఫిబ్రవరి 14న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల

అదే రోజున వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్న మంత్రి అచ్చెన్నాయుడు

దాదాపు నాలుగు వారాల పాటు కొనసాగనున్న సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో ఈ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

 

గవర్నర్ ప్రసంగం అనంతరం, సభలో ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 12న ఈ తీర్మానంపై చర్చ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చర్చకు సమాధానం ఇస్తారు.

 

ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. దాదాపు నాలుగు వారాల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం పొందడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్లు వద్దు గుడ్డ సంచులే ముద్దు మేయర్ రాయల భాగ్యలక్ష్మి
విజయవాడ నగరపాలక సంస్థ  19-12-2025        *ప్రతి ఒక్కరూ తమతోపాటు...
By Rajini Kumari 2025-12-20 12:39:34 0 180
Andhra Pradesh
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-06-28 07:21:22 0 61
Andhra Pradesh
యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్
కర్నూలు : కర్నూలు సిటీ :  * యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ...
By Hari Krishna 2026-01-18 13:37:39 0 177
Telangana
దారుణంగా మరణం....
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన...
By Gujile Ramu 2026-04-28 07:00:56 0 328
Andhra Pradesh
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...
By Pagadala Venkateswar 2026-06-21 07:34:04 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com