హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|

0
142

హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో నగరవాసులు గాలి తీసుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది.

దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలైన బెంగుళూరు, చెన్నై లను అధిగమించి హైదరాబాద్ అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది.

 

ప్రమాదకరస్థాయిలో సికింద్రాబాద్ :

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, సికింద్రాబాద్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకరంగా 240 కి చేరుకుంది. ఈ స్థాయి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

 

ముఖ్యమైన వివరాలు:

3 నుండి 4 రెట్లు అధికం. గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు, (pm. 2.5. మరియు pm 10) అనుమతించిన స్థాయి కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

 

బెంగుళూరు, చెన్నై కంటే అద్వాన్నం :

వాతావరణ పరిస్థితులు, వాహనాల కాలుష్యం కారణంగా, మన నగరం ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువ భారాన్ని మోస్తోంది. 

 

శ్వాసకోశ వ్యాధుల ముప్పు :

గాలిలో కాలుష్య స్థాయి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

అధికారుల హెచ్చరిక:

నిర్మాణరంగ కార్యకలాపాలు, విపరీతమైన వాహనాల రద్దీ, మరియు చలికాలంలో ఉండే స్థిరమైన వాతావరణం వల్ల కాలుష్య కణాలు భూమికి దగ్గరగా ఉండిపోతున్నాయి.

తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TSPCB) ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘా పెంచి, కాలుష్య నివారణ చర్యలపై సమీక్షిస్తోంది.

 

SIDHUMAROJU✍️

Alwal

Search
Categories
Read More
Telangana
గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్...
By Prashanth Goindla 2026-02-02 18:07:35 0 216
Andhra Pradesh
గంపలగూడెం రహదారులకు మహర్దశ
*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*   *గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*...
By Rajini Kumari 2026-01-14 12:45:30 0 140
Andhra Pradesh
Adani Group: ఏపీకి అదానీ-ఎంబ్రాయెర్ విమానాల ఫ్యాక్టరీ? అనంతపురంపై ప్రభుత్వ దృష్టి.
అదానీ, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయెర్ మధ్య విమానాల తయారీకి ఒప్పందం ఈ ప్రాజెక్టును ఏపీకి తెచ్చేందుకు...
By Pagadala Venkateswar 2026-01-28 06:48:14 0 88
Andhra Pradesh
పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-02 10:21:27 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com