హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|

0
80

హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో నగరవాసులు గాలి తీసుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది.

దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలైన బెంగుళూరు, చెన్నై లను అధిగమించి హైదరాబాద్ అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది.

 

ప్రమాదకరస్థాయిలో సికింద్రాబాద్ :

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, సికింద్రాబాద్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకరంగా 240 కి చేరుకుంది. ఈ స్థాయి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

 

ముఖ్యమైన వివరాలు:

3 నుండి 4 రెట్లు అధికం. గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు, (pm. 2.5. మరియు pm 10) అనుమతించిన స్థాయి కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

 

బెంగుళూరు, చెన్నై కంటే అద్వాన్నం :

వాతావరణ పరిస్థితులు, వాహనాల కాలుష్యం కారణంగా, మన నగరం ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువ భారాన్ని మోస్తోంది. 

 

శ్వాసకోశ వ్యాధుల ముప్పు :

గాలిలో కాలుష్య స్థాయి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

అధికారుల హెచ్చరిక:

నిర్మాణరంగ కార్యకలాపాలు, విపరీతమైన వాహనాల రద్దీ, మరియు చలికాలంలో ఉండే స్థిరమైన వాతావరణం వల్ల కాలుష్య కణాలు భూమికి దగ్గరగా ఉండిపోతున్నాయి.

తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TSPCB) ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘా పెంచి, కాలుష్య నివారణ చర్యలపై సమీక్షిస్తోంది.

 

SIDHUMAROJU✍️

Alwal

Search
Categories
Read More
West Bengal
Modi’s Military Meet at Kolkata Sparks Strategy Debate |
Prime Minister Narendra Modi inaugurated the 16th Combined Commanders’ Conference at Vijay...
By Pooja Patil 2025-09-15 10:29:51 0 142
Andhra Pradesh
క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ...
By Chennaiah Kati 2026-01-14 06:14:18 0 157
Andhra Pradesh
విద్యతోనే మెరుగైన సమాజం
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఘనంగా...
By Rajini Kumari 2026-02-07 11:52:16 0 36
Andhra Pradesh
పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ
పుంగనూరు మండలం బండ్లపల్లె టీచర్ జ్యోతిలక్ష్మి, ఎలాంటి అనుమతులు లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి...
By Kothuru Murali 2026-02-13 06:18:07 0 14
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com